పాకిస్తాన్ను నాశనం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఖొరాసన్ గ్రూప్ హెచ్చరించింది. దాని ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజు దయనీయమైన పరిస్థితికి పాకిస్తాన్ మాత్రమే బాధ్యత వహిస్తుంది. తాలిబన్ల పాలన తర్వాత కూడా ఇక్కడ ఇస్లామిక్ చట్టాలు అమలు కావడం లేదు. ఐఎస్ఐఎస్-కె చీఫ్ టెర్రరిస్ట్ నజీఫుల్లా పాకిస్తాన్తో పోరుకు దిగుతానని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు.
ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం ఏమి జరిగినా దానికి బాధ్యుత పాకిస్తాన్దే. పాకిస్తాన్ను నాశనం చేయడమే మా ముందున్న లక్ష్యం అని ఐఎస్కు చెందిన ప్రముఖ ఉగ్రవాది నజీఫుల్లా చెప్పినట్లు ఆఫ్ఘన్ న్యూస్ పేర్కొంది.