కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పర్యటనకి అనుమతి నిరాకరించటాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం ఆర్ట్స్ కళాశాల వద్ద సిఎం కె.సి.ఆర్ దిష్టిబొమ్మను ఓయూ జె.ఏ.సీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు పోలీసుల మధ్య పెనుగులాట జరిగింది.
చివరికి విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పోలీస్టేషన్ కి తరలించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా పోలీసుల కళ్ళు కప్పి ఓయూ జె.ఏ.సీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ విద్యార్ధి నాయకులు కోటూరి మానవతా రాయ్, డాక్టర్ కేతూరి వెంకటేష్, దుర్గం భాస్కర్, బాలలక్ష్మి, గడ్డం శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.