25.7 C
Hyderabad
May 22, 2024 07: 00 AM
Slider గుంటూరు

చురుకుగా సాగుతున్న టీడీపీ సభ్యత్వం నమోదు కార్యక్రమం

#tdp

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ఇస్సాపాలెం గ్రామంలో అల్లూరి శ్రీనివాస్ రావు,క్రిష్టయ్య ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటే బీమా వర్తిస్తుందని, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా చదువు చెప్పిస్తామన్నారు.

ఆపదలో ఉన్న కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకోవడానికి యువత ఉత్సాహం చూపుతున్నారని వారి నుంచి విరివిగా సభ్యత్వాలు చేయాలన్నారు. గ్రామంలో శస్త్రచికిత్స చేయించుకున్న తమ్మిశెట్టి శ్రీనివాసరావును పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బందరూపల్లి విశేశ్వరవు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పులిమి రామిరెడ్డి,మక్కుల కటయ్య,తమ్మిశెట్టి ఎల్లమంద,తమ్మిశెట్టి పెద్ద ఎల్లమంద,అల్లూరి వినాయకుడు, మాజీ ఎంపిపి కడియం కోటి సుబ్బారావు,మండల తెలుగు యువత అధ్యక్షుడు యంపరాల ఖాసీం,మండల మైనార్టీ అధ్యక్షుడు మోతాదు హుస్సేన్,మొహమ్మద్ రఫీ, చల్లగుండ్ల హరికృష్ణ తదితర పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపికైన ‘‘బికినీ భామ’’

Satyam NEWS

కిడ్నీ వ్యాధుల పట్ల అందరికీ అవగాహన పెరగాలి

Satyam NEWS

జన్మస్థలం లో ఎన్నారై సేవా నిరతి….

Satyam NEWS

Leave a Comment