ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్బంగా గురువారం శ్రీకాకుళం నగరంలో జెమ్స్ ఆసుపత్రులు, క్రీడాప్రాధికార సంస్థ, ఇంటర్నేషనల్ వాకర్స్ సంస్థలు సంయుక్తంగా అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించాయి. మూత్రపిండాల వ్యాధి నియంత్రణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని వక్తలు పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాకర్స్ సభ్యులు శాసన జోగినాయుడు, మాజీ ఇంటర్నేషనల్ వాకర్స్ అధ్యక్షులు గేదెల ఇందిరా ప్రసాద్, జిల్లా క్రీడా శాఖ అధికారి బి శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.