29.7 C
Hyderabad
May 6, 2024 03: 16 AM
Slider కడప

జన్మస్థలం లో ఎన్నారై సేవా నిరతి….

#waterplant

విదేశాల్లో ఉన్న స్వదేశంలో ఉన్న పుట్టిన ఊరిపై మమ కారంతో ఓ ఎన్నారై పలు దళిత వాడల్లో త్రాగునీటి ఆర్వో ప్లాంట్ల తో పాటూ గుళ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు ముమ్మరంగా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పెద్దకారం పల్లి అవసానిపల్లి హరిజనవాడలో శుక్రవారం నూతన నూతన త్రాగునీటి ఆర్ ఓ ప్లాంట్ ని ఎన్నారై  హెచ్ఆర్ పండిట్,గ్యాన్టెక్ ఈ పబ్లిసింగ్, ఈ బుక్స్ టు గో, ప్రోవేస్ సంస్థల సీఈఓ మరియు ప్రెసిడెంట్ మన్నూరు కేకే రెడ్డి ఏర్పాటు చేశారు. ఆయన పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ఆర్ ఓ ప్లాంట్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టిన ఊరి రుణం తీర్చుకోనడమే కాక తన భావితరాల ఐటి ఆశావహులకు తాను ఒక మూల స్తంభం లాగా ఉండబోతామని కే.కే. రెడ్డి వెల్లడించారు. రాబోవు 2024 అమెరికా వీసా కోటాలో, అమెరికా వెళ్లాలనుకునే రాజంపేట మండలము ముఖ్యంగా పెద్దకారంపల్లె పంచాయతీ కి చెందినటువంటి ఐటీ రంగ నిపుణులకు తమ ఫౌండేషన్ స్పాన్సర్షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

గ్రామ మహిళలు అవసాని శ్యామల మరియు గంగాదేవి మాట్లాడుతూ తమ కాలనీకి పరిశుభ్రమైన తాగు నీటిని అందించే ఆర్ ఓ ప్లాంటును ఏర్పాటు చేసిన శ్రీమతి రామలక్ష్మమ్మ మరియు నారాయణరెడ్డి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపినారు. రాజంపేట మండలం పెద్ద కారం పల్లెకు చెందిన వారి తల్లిదండ్రులు మన్నూరు రామలక్ష్మమ్మ మరియు నారాయణరెడ్డి పేరిట ఈ సేవా కార్యక్రమాలు ఆయన చేపట్టారు.ఈ సభలో మన్నూరు వెంకటసుబ్బా రెడ్డి,వీరబల్లి ఎంపీపీ గాలివీటి రాజేంద్ర నాథ్ రెడ్డి, ఎంపీటీసీ వరదరాజులు (బాబు),క్షత్రియ సంఘం భాస్కర రాజు,సుబ్బరాయుడు,డాక్టర్ హెచ్ వి రాజ తదితరులు సభలో ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గోని కే.కే.రెడ్డి సేవానిరతిని కొనియాడారు.

Related posts

ఉపేంద్ర కంచర్ల హీరోగా పసలపూడి ఎస్.వి. చిత్రం  “అనగనగా కథలా”

Satyam NEWS

స్వాగతం

Satyam NEWS

వేయిపడగలెత్తిన మేధావి

Satyam NEWS

Leave a Comment