ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని హుజూర్ నగర్ లో ఘనంగా నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా సెంటర్ లోని వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా గురువారం నియోజకవర్గ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంచార్జ్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలైన విద్య (ఫీజు రీయింబర్స్మెంట్) ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు,పేదలకు పింఛన్లు ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రజలలో చెరగని ముద్ర వేశాయని,మరల రాజన్న రాజ్యం రావాలంటే,రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్ షర్మిల సారథ్యంలోనే అది సాధ్యమౌతుందని అన్నారు.
అనంతరం వైయస్ షర్మిల సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేస్తున్న శుభ సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గ వైయస్సార్ అభిమానులు భారీ సంఖ్యలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్ నగరానికి తరలి వెళ్లారు.