ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించింది.
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు, యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,శంకర్ మేస్త్రి, జాఫర్, మేడం రమణ కర్,హరి కృష్ణ, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.