పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలన్నీ జగన్ రెడ్డి చేసిన హత్యలే అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. మద్య నిషేధం పై మాట తప్పిన జగన్ రెడ్డి, సొంత బ్రాండ్లతో ప్రజల ప్రాణాల మీదికి తెచ్చారన్నారు. నకిలీ బ్రాoడ్ల బాగోతం వెలికితీయాలని, సారా మరణాల పై న్యాయ విచారణ జరిపించాలని, ఒక్కో మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.