విశాఖ రేంజ్ ప్రజలకు విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కరోనా నిబంధనలకు అనుగుణంగా, జాగ్రత్తలు పాటించాలని, పూజలు చేసే క్రమంలో గుంపులుగా ఒక చోట చేరకుండా పండగ జరుపుకోవాలన్నారు.
ప్రజలంతా కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ఉండాలని, అందరి పట్ల సోదర భావంతో మెలగాలన్నారు. ప్రతీ ఒక్కరూ తమ వద్ద పని చేసే వారితో దయతో వ్యవహరించాలన్నారు. ప్రతీ ఒక్కరూ నీతి, నిజాయితీతో తమ బాధ్యతలను నిర్వర్తిస్తే సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించు కోవడంతోపాటు, అన్నింటా విజయం పొందవచ్చునన్నారు.
ప్రతీ ఒక్కరూ మహిళలు పట్ల గౌరవంతో, ఆరాధనా భావంతో మెలగాలని, ప్రతీ మహిళలోను మాతృమూర్తిని, సోదరిని చూడాలన్నారు. ప్రజలందరూ ఎటువంటి విద్వేషాలు లేకుండా ఒక కుటుంబంలా మెలగాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కే.వి.రంగారావు ఆకాంక్షించారు.