సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘానికి నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన హుజూర్ నగర్ పట్టణ నివాసి మాశెట్టి అనంత రాములు ను టిపిసిసి మాజీ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొలిశెట్టి లక్ష్మీనరసింహారావు,గజ్జి ప్రభాకర్, గుండా రమేష్,మాజీ ఎం పి టి సి శింగిరి కొండ శ్రీనివాస్,మట్టపల్లి వెంకటనారాయణ,ఈగ కోటేశ్వరరావు, కుక్కడపు కోటేశ్వరరావు,పారేపల్లి సత్యనారాయణ,తేలుకుంట్ల వెంకటేశ్వర్లు,బచ్చు రామారావు, హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు,3వ, వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి ఆర్యవైశ్య సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్