కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మున్నూరుకాపులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరుకాపు సంఘం ములుగు జిల్లా మంగపేట మండల సర్వసభ్య సమావేశం డిమాండ్ చేసింది. బుధవారం మంగపేట మండల కేంద్రంలోని సంఘ తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసిన ఆ సంఘ సర్వసభ్య సమావేశం కు ఆ సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి అధ్యక్షత వహించగా,నియోజకవర్గ కన్వీనర్ పిట్టల మధుసుధన్, చంద చక్రపాణిలు ప్రత్యేక ఆహ్వానితులు గా,రాష్ట్ర నాయకులు కోలా జనార్దన్ ముఖ్యఅతిథిగా హాజరై సమావేశానుద్దేశించి మాట్లాడారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి నుంచి మున్నూరుకాపు సంఘ పటిష్ఠతకు,ఐక్యతకు కృషి చేయాలని సూచించారు. తద్వారా రాష్ట్రoలోని మున్నూరు కాపులకు ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కు మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ సమావేశంలో మంగపేట మండల అడహాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ సలహాదారు డేగల ఆదినారాయణ,ముఖ్య సలహాదారుగా కడియాల సుదర్శన్,అడహక్ కమిటీ కన్వీనర్ గా జగదాభి సాంబశివరావు, కో- కన్వీనర్ గా ఆది జగదీశ్వర్, సభ్యులు గా మేడ ఆదినారాయణ, పసుపులేటి సుబ్బారావు, పడమటింటి శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు,సమావేశంకు మండలంలోని అన్ని గ్రామాల్లో గల మున్నూరు కాపు కులబంధువులు, సోదరులు,సోదరీమణులు,యువతీయువకులు హాజరై సమావేశం ను విజయవంతం చేశారు.