రోడ్డు ప్రమాదములో మరణించిన హోంగార్డు కుటుంబానికి గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆర్ధిక సహాయం అందచేశారు. గుంటూరు రూరల్ జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు ప్రసాద్ నాయక్ మరణించాడు.
సహోద్యోగి కుటుంబానికి సహచర హోంగార్డులు సాయంగా నిలవాలనుకున్నారు. రూరల్ జిల్లాలో పనిచేస్తున్న హోమ్ గార్డులు అందరూ కలసి తమ ఒక రోజు వేతనాన్ని ఇవ్వాలనుకున్నారు. దాంతో వారు ఆ కుటుంబానికి ఎస్ పి ద్వారా ఆ ఆర్ధిక సహాయాన్ని అందచేశారు.
ఆయన సతీమణి శ్రీదేవి బాయ్ కి రూరల్ ఎస్పీ చేతుల మీదుగా రూ 5,28,240/- చెక్కును అందజేశారు. హోమ్ గార్డు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎస్ పి, ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు.
తమ సహోద్యోగి కుటుంబానికి చేయూత అందించిన గుంటూరు రూరల్ హోంగార్డులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమములో ఎస్పీతో పాటు హోమ్ గార్డు ఆర్ఐ రవి కిరణ్ కూడా పాల్గొన్నారు.