38.2 C
Hyderabad
April 29, 2024 19: 15 PM
Slider గుంటూరు

రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డు కుటుంబానికి చెక్కు అందజేత

#gunturpolice

రోడ్డు ప్రమాదములో మరణించిన హోంగార్డు కుటుంబానికి గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆర్ధిక సహాయం అందచేశారు. గుంటూరు రూరల్ జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు ప్రసాద్ నాయక్ మరణించాడు.

సహోద్యోగి కుటుంబానికి సహచర హోంగార్డులు సాయంగా నిలవాలనుకున్నారు. రూరల్ జిల్లాలో పనిచేస్తున్న హోమ్ గార్డులు అందరూ కలసి తమ ఒక రోజు వేతనాన్ని ఇవ్వాలనుకున్నారు. దాంతో వారు ఆ కుటుంబానికి ఎస్ పి ద్వారా ఆ ఆర్ధిక సహాయాన్ని అందచేశారు.

ఆయన సతీమణి శ్రీదేవి బాయ్ కి రూరల్ ఎస్పీ  చేతుల మీదుగా రూ 5,28,240/- చెక్కును అందజేశారు. హోమ్ గార్డు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎస్ పి, ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు.

తమ సహోద్యోగి కుటుంబానికి చేయూత అందించిన గుంటూరు రూరల్ హోంగార్డులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమములో ఎస్పీతో పాటు హోమ్ గార్డు ఆర్ఐ  రవి కిరణ్  కూడా పాల్గొన్నారు.

Related posts

మత్య్సకారుల శ్రమను దోచుకుంటున్న మధ్య దళారులు

Satyam NEWS

పెళ్లి పీటలు ఎక్కబోతున్న వంగవీటి

Satyam NEWS

విద్యార్ధుల సమస్యలపై అవగాహనలేని విద్యా మంత్రి

Satyam NEWS

Leave a Comment