37.2 C
Hyderabad
April 26, 2024 20: 40 PM
Slider తూర్పుగోదావరి

ఇసుకను తరలిస్తున్న టిప్పర్ అడ్డుకున్న రామేశ్వరం గ్రామస్తులు

#rameshwaram

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం పరిధి నక్క రామేశ్వరం తీర ప్రాంతంలో  ఇసుక తవ్వకాలు టిప్పర్లతో గత రెండు రోజులుగా యథేచ్ఛగా సాగిస్తున్నారు. రామేశ్వరం మొగ తవ్వకాల ద్వారా వచ్చిన ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని గ్రీన్ బెల్ట్  సరుగుడు మొక్కలను నరికి వేశారు కూడా.

ఇసుక తవ్వకాలు సాగిస్తు తరలిస్తున్న ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జిల్లా కలెక్టర్ నుంచి పర్మిషన్స్ ఉన్నాయి అని ఇసుక మాఫియా ఎదురుదాడికి దిగుతున్నదని నక్కా రామేశ్వరం గ్రామస్తుల ఆరోపిస్తున్నారు.

ఇసుక తరలింపులపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కు స్పందనలో ఫిర్యాదు చేసినట్టు నక్కా రామేశ్వరం ప్రజలు తెలియజేశారు. అనంతరం టిప్పర్లను అడ్డుకుని వాటికి అడ్డంగా నిలబడి నిరసన చేపట్టారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది  తమను వాహనాలకు అడ్డు తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని నక్క రామేశ్వరం ప్రజలు ఆరోపిస్తున్నారు.

Related posts

2023 సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం

Murali Krishna

కేటీఆర్ ఐటీ హబ్:వరంగల్‌లో మరో ఐటీ కంపెనీ

Satyam NEWS

తృటిలో తప్పిన ప్రమాదం-కాపాడిన ఓ హెడ్ కానిస్టేబుల్..!

Satyam NEWS

Leave a Comment