సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామానికి చెందిన TDP పార్టీ వార్డు నెంబర్ కర్నే సైదిరెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో టి.ఆర్.యస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎంఎల్ఏ సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి టి.ఆర్.యస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు.
అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు టి.ఆర్.యస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో గరిడేపల్లి మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్ గౌడ్, గానుగబండ సర్పంచ్ పంగ వీరస్వామి, నాగుల్ మీరా, సైదాహుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.