ములుగు జిల్లా లో కరోనాతో ఇబ్బంది పడుతున్నకుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క సాయం చేస్తున్నారు.
గోవింద రావు పేట మండలం అమృత తండా లో 32 కరోనా బాధితులను పరామర్శించి బియ్యం పప్పు నూనె పండ్లు అందించారు. వీరంతా ఇటీవలే తిజ్ పండగలో పాల్గొనగా వారికి కరోనా సోకింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో ప్రజలందరూ అప్రమత్తం గా ఉండాలని కోరారు.
కరోనా వచ్చినవారు దైర్యం గా ఉండాలని మంచి ఆహారం తీసుకొని ఆరోగ్య పరమైన సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, మండల అధ్యక్షులు సహకార సంఘం చైర్మన్ పన్నలా ఎల్లారెడ్డి, సర్పంచ్ ముద్ద బోయిన రాము, గాంధీ నగర్ సర్పంచ్ సుఖ్య పాల్గొన్నారు.
ఇంకా, మాజీ మండల అధ్యక్షులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీపీ కణతల బుజ్జి,జెట్టి సోమయ్య, తెళ్ళ హరిప్రసాద్, రస్పుతు సీతారాం నాయక్, గ్రామ కమిటీ అధ్యక్షులు బర్ల సమ్మీ రెడ్డి,తండా రవి,చింత క్రాంతి కుమార్,వార్డు సభ్యులు సురేష్ శ్రవణ్, రవి ,సారయ్య,తదితరులు పాల్గొన్నారు.