30.7 C
Hyderabad
April 29, 2024 04: 52 AM
Slider ముఖ్యంశాలు

బివేర్: ఐఐటీ -జేఈఈ కొత్త సంస్థలను నమ్మ వద్దు

lalit kumar

గ్రేటర్ హైదరాబాద్ కొత్తగా పుట్టుకొస్తున్న ఐఐటీ -జేఈఈ విద్యాసంస్థల ను నమ్మ వద్దని ఐఐటీ -జే ఈఈ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ అన్నారు. ఇప్పటికే ఇలాంటి మోసపు సంస్థలు అడ్మిషన్స్ కోసం ప్రచారం మొదలు పెట్టాయని ఆయన అన్నారు.

తమ పిల్లల్ని మంచి సంస్థల్లో చేర్పించేందుకు తాపత్రయపడే తల్లిదండ్రులు ఇలాంటి సంస్థల్లో పిల్లల్ని చేర్చడం వల్ల నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. గతం లో వివిధ సంస్థలలో ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పిన అధ్యాపకులు కొందరు  SR నగర్, మాదాపూర్ లలో ఆకర్షణీయమైన భవంతులు అద్దెకు తీసుకుని ‘చైనా ‘ బ్యాచ్ లో పని చేశామని చెబుతున్నారని, కోట్లు, బూట్లు, బెల్టులు వేసుకొని తల్లిదండ్రులను మోసం చెయ్యడానికి  అడ్మిషన్స్ కోసం ప్రచారం మొదలెట్టారని ఐఐటీ -జే ఈఈ ఫోరం కన్వీనర్ లలిత్ కుమార్ అన్నారు.

వీరి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తం గా ఉండాలని కోరారు. హైదరాబాద్ నగరం లో అత్యుత్తమ ఐఐటీ -జేఈఈ శిక్షణా సంస్థలను ఫోరం ప్రకటిస్తుందని తెలిపారు. చివరికి  నిర్ణయం తల్లితండ్రులదే నని ఫోరం తెలిపింది. మరింత వాస్తవ  సమాచారం కోసం, సంస్థల లిస్ట్ కోసం Email :iitjeeforumap@gmail.com మెయిల్ చెయ్యాలని లేదా  98490 16661 ఫోన్ చేయాలని ఆయన కోరారు.

Related posts

పాపం… మెగాస్టార్ చిరంజీవి… ఇప్పుడేం చేస్తారో…..?

Satyam NEWS

కువైట్ వలస కార్మికులకు మా యూత్ వెల్ఫేర్ హెల్ప్

Satyam NEWS

హర్యానా లో ఆల్ ఇండియా షహీద్ భగత్ సింగ్ క్రికెట్ అండర్-18 ట్రోఫీ

Satyam NEWS

Leave a Comment