వనపర్తి పట్టణ 31వ వార్డుకు చెందిన కీర్తిశేషులు పాండురంగయ్య అనారోగ్యంతో బాధపడుతూ గత సంవత్సరం చనిపోయినందుకు వారి వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబసభ్యులు లక్షల రూపాయలు వెచ్చించారు. ఇందుకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా వారికి రూపాయలు 60,000 వేల రూపాయల చెక్కు, 45,000 వేల రూపాయల చెక్కు మొత్తం రూపాయలు 1,05,000 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అందజేశారు.ఈ సందర్భంగా 31వ వార్డు టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ షేక్ జహంగీర్ గౌరవ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కీర్తిశేషులు పాండురంగయ్య కుటుంబ సభ్యుల తరఫున 31వ వార్డు ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, వనపర్తి పట్టణ పార్టీ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్, వనపర్తిజిల్లా వక్ఫ్ ఆస్తుల రక్షణ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు షేక్ జహంగీర్ పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్