జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని అమరవీరుల దినంగా జరుపుకోవడం అభినందనీయమని ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ జడ్పీ సీఈఓ సుబ్బారావు అన్నారు. సి ఈ ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గాంధీజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులు అర్పించారు. మంగళవారం జడ్పీ స్టాండింగ్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన జడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు దేశ స్వాతంత్ర్య సాధనలో ప్రాణాలు పణంగా అర్పించిన పూజ్య బాపూజీకి ఘన నివాళులు అర్పించి కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్బంగా జడ్పీ చైర్మన్ పద్మశ్రీ మాట్లాడుతూ సత్యం, అహింస, ధర్మమే ఆయుధాలుగా గాంధీజీ దేశంకు పోరాడారని అన్నారు. ఈ సిద్ధాంతాలను అందరు పాటించి గాంధేయ మార్గం లో పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన జడ్పీటీసీ సభ్యులు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్, బీసీ నాయకులు ఘంటా ప్రసాద్, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి సత్యనారాయణ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
previous post