సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ దగ్గర గన్ మన్గా విధులు నిర్వహిస్తున్న నరేష్ అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి అనంతరం తాను కూడా గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన చిన్న కోడూర్ మండలం రాముని పట్లలో జరిగింది. అయితే రోజువారీగా విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన నరేష్ 9 ఎంఎం పిస్టల్తో భార్య చైతన్యను, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీని కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులు ఏమిటనేది ఇంకా తెలియ రాలేదు.