రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్టు విషయంలో మహారాష్ట్ర పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆత్మహత్య చేసుకున్న అన్వయ్ నాయక్ కు అర్నబ్ గోస్వామికి మధ్య నేరుగా లింక్ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో కనిపించడం లేదని రాయిగడ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అభిప్రాయపడ్డారు.
ముందుగా అర్నబ్ గోస్వామికి వైద్య సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. వైద్య పరీక్షల అనంతరం ఆ నివేదికలను పరిశీలించిన న్యాయమూర్తి సునైనా పింగ్లే అర్నబ్ గోస్వామి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని, గాయపరచలేదని నిర్ధారించారు. పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ కష్టడీకి పంపారు.