పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న అంతర్ రాష్ర్ట స్మగ్లర్ భాషా భాయ్ను ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుంది. నాలుగు రోజుల క్రితం వల్లూరు మండలం గోటూరు వద్ద జరిగిన ప్రమాదంలో లోకల్ హైజాక్ గ్యాంగ్ పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కడప, రాయచోటి, పెండ్లిమర్రి మండలాలకు చెందిన ముగ్గురు హైజాక్ గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వారిచ్చిన సమాచారం మేరకు భాషా భాయ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
భాషాభాయ్ అంతర్రాష్ర్ట ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా నాయకుడు. ఇతని కనుసన్నల్లోనే ఎర్రబంగారం ఇక్కడి నుంచి దేశ విదేశాలకు తరలిస్తుంటాడు. స్థానికంగా మంచి నెట్వర్కును కలిగి ఉన్నాడు. ఇతనితో పలువురు పోలీసులు కూడా చేతులు కలిపినట్లు ఆరోపణలున్నాయి. తమిళ కూలీల మరణం వెనుక భాషాభాయ్ హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.