అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బాగ్ అంబర్ పేట డివిజన్ సీఈ కాలనీలో 19 లక్షల రూపాయల నిధులతో నూతనంగా వేయనున్న మంచి నీటి పైప్ లైన్ పనులకు కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే సీఈ కాలనీలో పాదయాత్రగా పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్థానికులు ముఖ్యంగా కోరినట్లు పలు చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఈ కాలనీ ప్రజలు, సంబంధిత అధికారులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్