26.2 C
Hyderabad
May 19, 2024 19: 19 PM
Slider హైదరాబాద్

సీఈ కాలనీలో 19 లక్షలతో మంచి నీటి పైప్ లైన్

#CE Colony

అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బాగ్ అంబర్ పేట డివిజన్ సీఈ కాలనీలో 19 లక్షల రూపాయల నిధులతో నూతనంగా వేయనున్న మంచి నీటి పైప్ లైన్ పనులకు కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే సీఈ కాలనీలో పాదయాత్రగా పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

స్థానికులు ముఖ్యంగా కోరినట్లు పలు చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఈ కాలనీ ప్రజలు, సంబంధిత అధికారులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

ఆర్మీ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలెట్లు మృతి

Satyam NEWS

నారాయణగూడా ట్రాఫిక్ సి.ఐ.వెంకన్నకు సన్మానం                                            :

Satyam NEWS

డిమాండ్ ఉన్న పంటలు వేస్తేనే రైతుకు లాభం

Satyam NEWS

Leave a Comment