23.2 C
Hyderabad
May 7, 2024 20: 06 PM
Slider నల్గొండ

చంద్రబాబు పై కక్షపూరితమైన కేసు నమోదు చేయడం దుర్మార్గం

#TDP

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నల్లగొండ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి,హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై కక్ష సాధింపు కొరకే అక్రమ అరెస్టు చేయించి రిమాండ్ కు పంపారని ఆరోపించారు.

బుధవారం తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి,ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు.

ఈ సందర్భంగా మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని,ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయకుండా విధ్వంసకర విధానాలతో ముందుకు సాగుతున్నారని మర్శించారు.జగన్ ఎన్నికలలో గెలవలేక అక్రమ అరెస్టులతో భయపెట్టాలని స్తున్నారని,ప్రజాస్వామ్య,ప్రజాతంత్ర వాదులు అన్ని గమనిస్తున్నారని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి కుట్ర కుతంత్రాలతో ఆంధ్రప్రదేశ్ పరువు బజారున పడిందని అన్నారు.చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.జగన్ రెడ్డి విధానాలను ప్రశ్నించేందుకు అన్ని వర్గాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ అధ్యక్ష్య,ప్రధాన కార్యదర్శులు కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్,మీసాల సైదులు,మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మాలోత్ నాగు నాయక్, గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్ష్య,ప్రధాన కార్యదర్శులు కీసరి నాగయ్య ముదిరాజ్, గుండు వెంకటేశ్వర్లు గౌడ్,టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి, మాజీ ఎంపీపీ ఆళ్ల భాగ్యమ్మ చౌదరి, హుజూర్ నగర్ పట్టణ గౌరవ అధ్యక్షుడు తమ్మిశెట్టి రాములు,చింతలపాలెం మండల అధ్యక్షుడు మేకల రామారావు యాదవ్, హుజూర్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు కస్తొల కనక రత్నం,

రాష్ట్ర ఎస్టీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి భానోతు లక్ష్మనాయక్,ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భూక్య బాలాజీ నాయక్,ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మూడవత్ జానకి రామ్ నాయక్,తెలుగు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆళ్ల కోటయ్య చౌదరి, గరిడేపల్లి మండల అధికార ప్రతినిధి మర్రి రాములు,గరిడేపల్లి తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు వట్టికూటి అంజయ్య గౌడ్, గరిడేపల్లి బిసి నాయకులు చెరుకు రామానుజం గౌడ్,చింతలపాలెం మండల రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, రాంబాబు,అంజయ్య,సోమయ్య, రవి,గోపి, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

యాద్గార్ పూర్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం

Satyam NEWS

సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి

Satyam NEWS

రివెంజ్ పాలిటిక్స్: వెన్నుపోట్ల పై మంత్రులలో తీవ్ర అసంతృప్తి

Satyam NEWS

Leave a Comment