నారాయణగూడా ట్రాఫిక్ సి.ఐ.గా నియమితులైన సుక్క వెంకన్న సి.ఐ.గా (స్టేషన్ హౌస్ ఆఫీసర్)ను శివసేన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధన కార్యదర్శి ఏ.సుదర్శన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇతర నాయకులతో కలిసి ఆయనకు శాలువా కప్పి చత్రపతి శివాజీ మహారాజ్ ప్రతిమను బహుకరించారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తీర్చడంలో ముందు వరుసలో ఉండాలని కోరుకుంటూ సన్మానం చేశారు. నారాయణగూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో యువ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గణేష్, నీలం శ్రీనివాస్ యాదవ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట