నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని మొల్ల చింతలపల్లి గ్రామ సమీపంలో ఉన్న అసత్ పూర్ రాజా వారి భూములను పేద ప్రజలకు పెంచాలని సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శ వర్గ సభ్యులు జాన్ వెస్లీ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో మండల పరిధి మొల్ల చింతలపల్లి గ్రామ సమీపంలో ఉన్న కొల్లాపూర్ రాజా వారికి దాదాపు 2400 ఎకరాల భూమి ఉన్నది.
కానీ 800 ఎకరాలు నీటమునిగి లో పోయింది. 16 వందల ఎకరాలు పేద ప్రజలకు పంపిణీ చేయాలన్నారు. గతంలో రాజ గారి తండ్రి ప్రభుత్వానికి వెయ్యి ఎకరాల భూమిని స్వాధీనం పరిచారు. ఆ భూమిని కబ్జా చేసుకొని ఇప్పుడు అమ్ముతున్నారు.
ఈ భూమిలో 69 కుటుంబాలు నాలుగు వందల ఎకరాల్లో ఇక్కడి రైతులు దాదాపు 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుని బ్రతుకుతున్నారు. ఈ భూములన్నీ ఆంధ్రకు చెందిన పెట్టుబడిదారులు కి ఎకరా నాలుగు లక్షల 50 వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరు కూడా వారికి మద్దతు ఇస్తూ ఈ భూములను అమ్మిస్తున్నారు.
కాబట్టి ఈ భూములన్నీ కూడా భూములు లేని నిరు పేదలకు పంచాలని, సాగు లో ఉన్న 400 ఎకరాల భూమి వారికి పట్టాలు ఇచ్చి మిగతా భూములని పేదలకు పంచాలని కోరారు. ప్రభుత్వం ఈ భూముల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి పేద ప్రజలకు పంచాలని సిపిఎం పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శివవర్మ పెద్దకొత్తపల్లి మండల కార్యదర్శి దశరథం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యం తారా సింగ్ మండల కమిటీ సభ్యులు బి బాలపిర్ సలీం నాయకులు ముంతాజ్ అలి సేవ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.