గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. పొన్నూరు లో నేడు వైయస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు వ్యతిరేకంగా జరిగిన ఈ సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు.
దీనికి వందల సంఖ్యలో నాయకులు వేల సంఖ్యలో కార్యకర్తలు రావడం ఊహించని పరిణామం. పొన్నూరు యమ్ యల్ ఏ కిలారి తన స్వంత పార్టీ నాయకులపైన గత మూడు సంవత్సరాలుగా వేధింపులకు దిగుతున్నాడని వారు ఆరోపించారు. జగన్ అభిమానులమైన తమ పై ఎమ్మెల్యే కిలారి దాష్టీకం చేస్తున్నాడని వారన్నారు.
ఈ మీటింగు ఇచ్చిన ఉత్సాహంతో వారు అందరు జగన్ ను కలసి ఈ విషయాలను వివరించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు. ఇప్పటికైనా జగన్ గాని పార్టీ పెద్దలు గాని పొన్నూరు విషయాలపై దృష్టి పెట్టకపొతే పార్టికి ఇక్కడ డిపాజిట్లు కూడా రావని నాయకులు అన్నారు.