33.2 C
Hyderabad
May 14, 2024 13: 35 PM
Slider గుంటూరు

అధికార పార్టీ కార్యకర్తలనే వేధిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే

#ysrcongressparty

గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. పొన్నూరు లో నేడు వైయస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు వ్యతిరేకంగా జరిగిన ఈ సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు.

దీనికి వందల సంఖ్యలో నాయకులు వేల సంఖ్యలో కార్యకర్తలు రావడం ఊహించని పరిణామం. పొన్నూరు యమ్ యల్ ఏ కిలారి తన స్వంత పార్టీ నాయకులపైన గత మూడు సంవత్సరాలుగా వేధింపులకు దిగుతున్నాడని వారు ఆరోపించారు. జగన్ అభిమానులమైన తమ పై ఎమ్మెల్యే కిలారి దాష్టీకం చేస్తున్నాడని వారన్నారు.

ఈ మీటింగు ఇచ్చిన ఉత్సాహంతో వారు అందరు జగన్ ను కలసి ఈ విషయాలను వివరించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు. ఇప్పటికైనా జగన్ గాని పార్టీ పెద్దలు గాని పొన్నూరు విషయాలపై దృష్టి పెట్టకపొతే పార్టికి ఇక్కడ డిపాజిట్లు కూడా రావని నాయకులు అన్నారు.

Related posts

లక్నవరం సరస్సుకు అంతర్జాతీయ ఖ్యాతి తేవాలి

Satyam NEWS

కొత్త సంవత్సరం రోజున పుట్టినవారు ఎందరో తెలుసా?

Satyam NEWS

ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్స్ లో ఉద్యోగావకాశాలు

Satyam NEWS

Leave a Comment