36.2 C
Hyderabad
May 7, 2024 11: 18 AM
Slider నల్గొండ

గోపాలపురం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొన్న కెప్టెన్ ఉత్తమ్

#uttam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గోపాలపురం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముందుగా దేవాలయ కార్యనిర్వహణాధికారి,ఆలయ ప్రధాన అర్చకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి పూర్ణకుంభంతో స్వాగతం పలికి,స్వామి వారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తుల కోరికలు తీరుస్తూ ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలిచిన గొప్ప దైవం ఆంజనేయస్వామి అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, రాష్ట్ర ఐ ఎన్ టి యు సి నాయకుడు యరగాని నాగన్న గౌడ్,ఈడుపుగంటి సుబ్బారావు,యరగాని గురవయ్య,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,నియోజకవర్గ,మండల పరిధిలోనినాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యంన్యూస్, హుజూర్ నగర్

Related posts

ఆసక్తి రేకెత్తిస్తున్న కమల్ 232వ చిత్రం టీజర్

Satyam NEWS

ఆస్తిపన్ను పెంపు వ్యతిరేక ఉద్యమం తిరుపతి నుంచే శ్రీకారం

Satyam NEWS

ఐశ్వర్య రాయ్ కి రెవెన్యూ శాఖ నోటీసులు

Bhavani

Leave a Comment