ములుగు జిల్లా కి నూతనంగా గ్రంధాలయ చైర్మన్ గా ఎన్నిక అయిన పోరిక గోవింద నాయక్ ని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్(TEA) ములుగు జిల్లా శాఖ ఘనంగా సన్మానించింది. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నో కష్టనష్టాలకోర్చి నేడు ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పోరిక గోవింద నాయక్ ఎన్నికవడం చాలా సంతోష దాయకమైన విషయం అని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.
పోరిక గోవింద నాయక్ మరింత ఎత్తుకు ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ప్రసూనరాణి, డిప్యూటీ సీఈఓ రమాదేవి, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (TEA) జిల్లా అధ్యక్షులు గుల్లగట్టు సంజీవ, గౌరవ అధ్యక్షులు మడుగూరి నాగేశ్వర రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరం రవికాంత్, జిల్లా మహిళా చైర్ పర్సన్ శకుంతల, పట్టణ అధ్యక్షులు కలాలి మొగిలి, పంచాయతీరాజ్ సూపరిండెంట్ వసంతరావు , జిల్లా పరిషత్ సూపరిండెంట్ సుధాకర్, వినాయక్, సృజన్ , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.