37.2 C
Hyderabad
April 26, 2024 21: 02 PM
Slider ముఖ్యంశాలు

సీనియర్ నాయకుడు నాయని నర్సింహారెడ్డి ఇక లేరు

#NayaniNarsimhareddy

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాయని నర్సింహారెడ్డి మరణించారు. అనారోగ్యంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన కొద్ది సేపటి కిందట తుది శ్వాస విడిచారు.

 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పరామర్శించి వచ్చిన కొద్ది గంటలకే నాయని మరణించారు. ఆయనకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు.

నల్గొండ జిల్లా దేవకొండ సమీపంలోని నేరడుగొమ్ము గ్రామంలో ఆయన 1934 మే నెల 12 వ తేదీన జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన తెలంగాణ రాష్ట్రానికి తొలి హోం శాఖ మంత్రి అయ్యారు.

 ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Related posts

బ్రహ్మర్షి సద్గురు శ్రీశ్రీశ్రీ స్వామి రామానందుల వారి 121వ జయంతి

Satyam NEWS

మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచే

Satyam NEWS

దంచి కొడుతున్న ఎండలు

Satyam NEWS

Leave a Comment