కొత్త ఏడాది లో విజయనగరం పోలీసులు పేద్ద రికవరీ సాధించారు. అదీ జిల్లా పోలీసు బాస్ …ఎస్పీ దీపికా ఆధ్వర్యంలో విజయనగరం వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు ఆదేశానుసారం….”అ” నలుగురు.. అంటే అశోక్, అచ్చిరాజు, అనిల్, అజయ్ లు ఈ నలుగురు..8 వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు విజయనగరం లో పరిగెత్తి పరిగెత్తి చివరకు ఫిర్యాదు దారుడు ఇచ్చిన కంప్లైంట్ లో పోయిన బంగారం సొత్తు మొత్తం..30 తులాలను పట్టుకున్నారు.ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దీపికా… వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు, ఇంచార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు లు సంయుక్తంగా మీడియా సమావేశం పెట్టిన మరీ మాట్లాడారు. బాధితుడు ఫిర్యాదు ఇచ్చిన 24 గంటలలో నిందితులను పట్టుకున్నామని…పోయిన గోల్డ్ రికవరీ మొత్తం స్వాధీన పరచుకున్నామని ఎస్పీ దీపికా ఈ సందర్భంగా చెప్పారు.
previous post
next post