42.2 C
Hyderabad
May 3, 2024 15: 09 PM
Slider వరంగల్

మేడారంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0

#mulugumla

స్వాతంత్య్రం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న  “అజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ములుగు జిల్లా మేడారంలో 39 Bn Crpf వారు Fit India Freedom Run 2.0 నిర్వహించారు. 39 Bn కమాండెంట్ RK పాండా ఆధ్వర్యంలో  39Bn crpf OC ఏసుదాసు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఏఎస్పీ ఏటూరునాగారం గౌష్ ఆలం, F.D.O ప్రశాంత్ బి పాటిల్  హాజరయ్యారు. ములుగు MLA సీతక్క సైకిల్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించారు. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమంలో మేడారం నుండి తాడ్వాయి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

పస్రా సీఐ అనుముల శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై సీచ్. వెంకటేశ్వరరావు, తాడ్వాయి PSI అరుణ్, CRPF OC ఇన్స్పెక్టర్ MP నాయుడు, CRPF SI అశోక్ కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాటు చూసుకోవడంతో పాటు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, 39 Bn CRPF సిబ్బంది, తాడ్వాయి స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

గబ్బు గబ్బు గా గాంధీనగర్

Bhavani

హైదరాబాద్ మునగడానికి కారణాలు తెలియవా?

Satyam NEWS

పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలి

Bhavani

Leave a Comment