పేద ప్రజలకు బి ఎల్ అర్ ట్రస్ట్ ఎల్లప్పుడు అందుబాటులో వుంటుంది అని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, బి ఎల్ అర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం సంక్రాతి పర్వదినాన్ని పురస్కరించుకుని రామంతపూర్ డివిజన్ లో బి ఎల్ అర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్విని చేసుకొని వివిధ రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలి అని అన్నారు పురుషులతో పాటు సమానంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలన్నారు. బి ఎల్ అర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ గౌడ్ చాందు పాష, నరేశ్, శేకర్, అరవింద్, పవన్, హరీష్, ప్రశాంత్, శ్రీను, జాంగిర్, యాకంత్ , మారుతి,మున్న, కిషోర్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా