24.7 C
Hyderabad
May 19, 2024 01: 31 AM
Slider జాతీయం

కన్హయ్యాలాల్ కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు

#ashokgehlot

నుపూర్ శర్మ ఫొటోను డిపిగా పెట్టుకున్నందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జూన్ 28న దారుణంగా గొంతు కోసి హత్య చేసి ఉదయ్‌పూర్‌కు చెందిన కన్హయ్యాలాల్ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాజస్థాన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయన ఇద్దరు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నారు.

సిఎం హౌస్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి అశోక్ గల్హోట్ ఈ విషయాన్ని ప్రకటించారు. కేబినెట్‌లో వచ్చిన ఈ ప్రతిపాదనకు మంత్రులందరూ కూడా అంగీకరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కన్హయ్య కుటుంబానికి రూ.51 లక్షల చెక్కును అందజేసింది.

అతను ధన్మండి ప్రాంతంలోని భూత్ మహల్ ప్రాంతంలో నివసించేవాడు. వృత్తిరీత్యా టైలర్. బట్టల కొలత ఇస్తానన్న నెపంతో ఇద్దరు ముస్లిం యువకులు అతని దుకాణానికి చేరుకుని పదునైన ఆయుధాలతో కన్హయ్యపై దాడికి పాల్పడ్డారు. వేగవంతమైన దాడులతో కన్హయ్య కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.

మెడ కోయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో షాపులో పనిచేస్తున్న అతని సహోద్యోగి ఈశ్వర్ సింగ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Related posts

హైదరాబాద్ లో కరోనా లాబ్య్ వివరాలు ఇవి

Satyam NEWS

ఢిల్లీలో మంత్రి నిరంజన్ రెడ్డి, వనపర్తి నేతలు

Satyam NEWS

చంద్రబాబుతో తెలంగాణ తెలుగుదేశం నేతల భేటీ

Satyam NEWS

Leave a Comment