తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడితో నేడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన భేటీ అయ్యారు.
వినాయకచవితి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన కాట్రగడ్డ ప్రసూన తెలంగాణ లో పార్టీ పరిస్థితిని చంద్రబాబునాయుడికి వివరించారు.
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆమె తెలిపారు. కార్యకర్తలను కాపాడుకోవాలని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా సూచించారు.