29.7 C
Hyderabad
April 29, 2024 09: 21 AM
Slider గుంటూరు

మరణించిన హోంగార్డు కుటుంబసభ్యులకు చేయూత

#GunturSP

గుంటూరు రూరల్ జిల్లా హోమ్ గార్డు విభాగములో విధులు నిర్వహిస్తూ ఆరు నెలల కిందట అనారోగ్యంతో మరణించిన షేక్ మోహిద్దీన్ బాషా కుటుంబానికి గుంటూరు రూరల్ పోలీసులు అండగా నిలిచారు. అదే విధంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన వెంకట రామారావు నాయక్ కుటుంబానికి కూడా గుంటూరు రూరల్ పోలీసులు చేయూత అందించారు.

రూరల్ జిల్లాలో పనిచేస్తున్న హోమ్ గార్డులు అందరూ కలసి తమ ఒక రోజు వేతనాన్ని అందించాయి. మరణించిన వారి సతీమణులైన నాగుల మీరాభికి రూ.5,26,110/-, ఉషాబాయ్ కి రూ.5,23,980/- చెక్కులను ఎస్పీ విశాల్ గున్నీ అందించారు. మరణించిన హోమ్ గార్డు కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపి, ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.

తమ తోటి సహోద్యోగి కుటుంబానికి చేయూత అందించడానికి ముందుకు వచ్చి తమ ఒక రోజు వేతనాన్ని అందించిన రూరల్ జిల్లా హోమ్ గార్డుల ఐక్యత గొప్పది అని, వీరి ఐక్యత భవిష్యత్తులో ఈ విధంగానే కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమములో ఎస్పీ తో పాటు హోమ్ గార్డు ఆర్ ఐ రవి కిరణ్ కూడా ఉన్నారు.

Related posts

ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC

Sub Editor

ఆన్‌లైన్‌ తరగతులతో సరికొత్త చరిత్రకు నారాయణ శ్రీకారం

Satyam NEWS

ఇంకా తేలని నరేంద్రగిరి అఖాడా డెత్ మిస్టరీ

Sub Editor

Leave a Comment