రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతుంది. ఆదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని ఫణిదం గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి అంబటి గత మూడేళ్లలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని వివరిస్తున్నారు.
సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. మళ్లీ మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మీ దగ్గరకు వచ్చామన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖునే ఠంచనుగా ఉదయమే రూ.2,500 చొప్పున పెన్షన్ ఇచ్చి, మనవడిలా సీఎం వైఎస్ జగన్ ఆదుకుంటున్నారని వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికార గణం గ్రామాల పర్యటించడం తో సందడి వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు నియోజకవర్గ యువజన నాయకులు కళ్ళ విజయభాస్కర్ రెడ్డి, ఎంపీపీ షేక్ జైబూన్ బి, జెడ్పిటిసి సభ్యులు సంకటి నాగేశ్వరమ్మ, సర్పంచ్ వేమవరపు బుల్లిబాబు, ఎంపిటిసి పల్లె పోగు రాహేలమ్మ భూపతి, సుంకర నాగమల్లేశ్వరి, ఎంపీడీవో సత్యనారాయణ, వు,తహశీల్దార్ నగేష్, కార్యదర్శి వీరంజనేయులు, సచివాలయ సిబ్బంది ,మండల నాయకులు తదితరులు ఉన్నారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా