అనాధ శవానికి అన్ని తామే అయి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు మహబూబాబాద్ పోలీసులు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని ఒక మహిళ మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో మూడురోజుల క్రితం వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయింది.పోలీసులు గుర్తించి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. ఎవరైనా ఆమె ను వెతుకుతూ వస్తారనే ఆశతో ఆసుపత్రి మార్చురీలోనే ఆమె మృతదేహాన్ని ఉంచారు. పాపం ఆ అభాగ్యురాలికోసం అయిన వారెవ్వరూ రాలేదు. దీంతో అనాదమృతదేహానికి అంతిమసంస్కారం నిర్వహించే బాద్యతను పోలీసులే తీసుకున్నారు.
మహబూబాబాద్ టౌన్ సిఐ వెంకటరత్నం మానవత్వంతో స్పందించి తమ సిబ్బంది ఎస్ఐ సంతోష్ కుమార్, కానిస్టేబుల్ మోహన్ రాజు లతో కలిసి అనాధ శవాన్ని శ్మశానవాటికకు తరలించారు. పూలమాలవేసి నివాళులు అర్పించి మృతదేహాన్ని ఖననం చేసారు. అనాద మృతదేహానికి అన్నీ తామే అయ్యి అంతిమ సంస్కారాలు నిర్వహించిన సిఐ వెంకటరత్నం, ఎస్ఐ సంతోష్ కుమార్, కానిస్టేబుల్ మోహన్ రాజు ల మానవత్వానికి మంచిమనుసును ప్రజలు ప్రశంసిస్తున్నారు