సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన తెరాస పార్టి కార్యకర్త గోపాల్ దాసు అంజయ్య కుటుంబానికి తెరాస పార్టీ సభ్యత్వ భీమ 2 లక్షల రూపాయల చెక్కును హుజూర్ నగర్ నియోజకవర్గం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబానికి అందచేశారు.
ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.