32.2 C
Hyderabad
May 19, 2024 18: 01 PM
Slider గుంటూరు

భవిష్యత్తుకి గ్యారెంటీ పేరుతో టీడీపీ బస్సు యాత్ర

#TDP bus

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామం జేఎన్టీయూ కాలేజ్ వద్ద నుండి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో టీడీపీ బస్సు యాత్ర ప్రారంభమైంది. ప్రజలు,టీడీపీ కార్యకర్తలు,నాయకులు బస్సు యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని బస్సు యాత్ర సంఘీభావం తెలిపారు.

టీడీపీ నేతల బస్సు యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. బస్సు యాత్రలో డా౹౹చదలవాడ మాట్లాడుతూ……వైసీపీ ధర్మార్గాలను, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి,అక్రమాలను ప్రజలకు తెలిపీ వైసీపీ కుటిల రాజకీయాలను బహిర్గతం చేశారు.

కాకాని నుంచి ములకలూరు వరకు సాగె బస్సు యాత్రలో డా౹౹చదలవాడ అరవింద బాబు వైసీపీ గుండా రాజకీయాలను ఎదుర్కోవడమే లక్ష్యంగా విమర్శనాస్త్రాలను ఎక్కువ పెట్టారు. వైసీపీ వైఫల్యాలు,దుర్మార్గాల పై ప్రతి ఒక్కరు పోరాటం చేసి తెలుగుదేశం ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని అరవింద బాబు పిలుపునిచ్చారు.

టీడీపీ చేసే బస్సు యాత్ర ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలుకుతుందని గుండా రాజకీయాలను రాష్ట్రం దాటిస్తుందని,మన బస్సు యాత్ర వైసీపీ అధికారానికి అంతిమయాత్ర కావాలన్నారు.

Related posts

రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారు పతనం అవుతారు

Satyam NEWS

చౌడవాడ ఘటన… పోలీస్ సిబ్బందికి ప్రోత్సాహకాలు

Satyam NEWS

సత్తెమ్మ గుడి వద్ద పోటెత్తిన జనం

Satyam NEWS

Leave a Comment