ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. యూపీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కీలక ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 టిక్కెట్లు కేటాయిస్తామని ప్రియాంక గాంధీ స్పష్టంచేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై సమీక్ష అనంతరం ప్రియాంక గాంధీ మహిళలు మార్పు తీసుకురాగలరని, వారు మరో అడుగు ముందుకు వేయాల్సి ఉందంటూ పేర్కొన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని బాలికల కోసం, మార్పును కోరుకునే మహిళల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టంచేశారు.