మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు.దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నదీపాయలో భక్తులు స్నానాలు ఆచరించి వనదుర్గామాత దర్శనం కోసం బారులు తీరారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బదులు లేకుండా దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.