చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులకు జైలు అధికారులే తమ తమ కుటుంబ సభ్యులను చూసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు.చట్ట ప్రకారం తాము తీర్చే చివరి కోరికలు ఉంటె చెప్పాలని దోషులను కోరగా వారు మౌనంగా ఉండటం తో జైలు అధికారులే మానవత్వం తో ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది.మరో వైపు నిర్భయ దోషులను ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులను చివరిసారిగా చూసుకునే అవకాశం దోషులకు కల్పించేందుకు వారి కుటుంబాలకు అధికారులు వర్తమానం పంపారు. ‘నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఫిబ్రవరి 1న ఉరితీస్తున్నాం. ఈలోపు మీ పిల్లల్ని చివరి సారిగా చూసుకోవడానికి ఉరితీసే సమయంలోపు జైలుకు రావచ్చు’ అని సమాచారం ఇచ్చారు.