నాగర్ కర్నూలు జిల్లాలోని చారకొండ మండలం రామచంద్రాపురం, ఈ నెల 23న పాజిటివ్ కేసు నమోదు కాగా నేడు వంగూరు మండలం కొండారెడ్డి పల్లి లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ శ్రీధర్ అప్రమత్తం శారు.
బుధవారం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో కరోనా నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గ్రామాల్లో మాస్కులు భౌతిక దూరం తప్పనిసరి అని అన్నారు.
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
కల్వకుర్తి డివిజన్లో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడికి చేరుకున్న జిల్లా కలెక్టర్.. ఆర్ డి ఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రామచంద్రపురం లో ప్రైమరీ కాంటాక్ట్స్ 44 మంది సెకండరీ ప్రైమరీ కాంటాక్ట్స్ 80 మందిని హోమ్ క్వారంటైన్ లో ఉంచామని, కొండారెడ్డిపల్లి ప్రైమరీ కాంటాక్ట్స్ 14 మందిని గుర్తించామని కలెక్టర్ తెలిపారు.
అధికారులు ఆయా గ్రామాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని, శానిటేషన్ పనులు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రెండు కేసులు హైదరాబాదుకు చికిత్స నిమిత్తం వెళ్లిన వారేనని వారికి అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ కేసుగా గుర్తించారు.
అయితే రామచంద్రపురం ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్స్ కరోనా పరీక్షలు నిర్వహించగా, వారికి కరోనా లేదని నిర్ధారణ అయింది అన్నారు. ఇవాళ కొత్తగా నమోదైన కరోన పాజిటివ్ కేసులకు సంబంధించిన వారిని హోమ్ క్వారంటైన్ కు తరలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
భౌతిక దూరం పాటించకపోతే కఠిన చర్యలు
హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారి ఆరోగ్య వివరాలపై ప్రతిరోజు వైద్యుల పర్యవేక్షణ కొనసాగించాలని, కలెక్టర్ వైద్యులను ఆదేశించారు. గ్రామాల్లో కిరాణం మెడికల్ బ్యాంకులు ఇతర ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు భౌతిక దూరం పాటించాలని అలా పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఫైన్ వేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ కు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ ఆర్డిఓ రాజేష్ కుమార్ కల్వకుర్తి డీఎల్పీవో ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.