31.2 C
Hyderabad
May 18, 2024 18: 01 PM
Slider ముఖ్యంశాలు

ఆస్పత్రికి వచ్చిన యువతి అదృశ్యం

#kamareddy

ఆస్పత్రికి వచ్చిన ఓ యువతి అదృశ్యం అయిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. కామారెడ్డి పట్టణ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం.. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామానికి చెందిన గంగాధర మౌనిక(24) శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కామారెడ్డిలో ఉన్న శ్రీ లక్ష్మీ హాస్పిటల్ కు వచ్చి ఇక్కడి నుండి వాళ్ళ అమ్మ, కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. మౌనిక ఆచూకీ గురించి చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె తల్లి గంగాధర జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మౌనిక ఆచూకీ తెలిసిన వారు కామారెడ్డి పట్టణ పోలీసులకు తెలపాలని కోరారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన డిసిపి

Satyam NEWS

కేంద్రం నిర్ణయంతో అడకత్తెరలో ఆంధ్రప్రదేశ్

Bhavani

బీజేపీ హత్యాకాండ: 8 మంది రైతులను హత్య చేసిన కేంద్రం…!

Satyam NEWS

Leave a Comment