కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిని తక్షణం బర్తరఫ్ చేయాలని…రైతులను చంపిన బిజెపి గుండాలపై డర్ క్రిమినల్ కేసులు పెట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. కేంద్రంలోబీజేపీ ప్రభుత్వం…8 మంది రైతులను హత్య చేసినందుకు నిరసనగా విజయనగరం జిల్లా కలక్టరేట్ వద్ధ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లో లక్మిపూర్ ఖేహేరీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ గుండాలు దాడి చేసి 3గురు రైతులను చంపారని….మరోకరిని కాల్చి చంపారని…. అనంతర మరో సంఘటనలో మరో నాలుగు మంది రైతులను హత్య చేశారని ఆరోపించారు. ఈ బీజేపీ గూండాల దాడిని ప్రజాస్వామ్య వాదులందరు ఖండించాలని కోరారు.
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దేశానికి నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతాంగపై దాడి చేయడం చాలా దుర్మార్గం చర్యని అన్నారు.
ఈ దాడికి పాల్పడిన కేంద్ర హోమ్ మంత్రి అజయ్ మిశ్రా ను బర్తరఫ్ చేయాలని కోరారు కొడుకు సోను ను అరెస్ట్ చేసి జీవిత కాలం శిక్ష విధించాలని రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మ, నగర కమిటీ నాయకులు రమణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.