24.7 C
Hyderabad
May 19, 2024 00: 17 AM
Slider ముఖ్యంశాలు

లారీ ఆటో ఢీ కొని ఆరుగురు మృతి

#lorry collision

డ్రంక్ డ్రైవ్ ప్రమాదకరమని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కొందరికి మాత్రం అస్సలు పట్టడం లేదు. తాగేసి డ్రైవింగ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఓ లారీ డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి.. రాంగ్ రూట్‌లో ఆటోను నడిపి ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా..

ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మద్యం సేవించి, రాంగ్ రూట్‌లో లారీని నడపడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో నుజ్జునుజ్జు అయిపోయింది. మృతదేహాలన్నీ ఆటోలోనే చిక్కుకుపోయాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Related posts

వాట్సాప్ ద్వారా ఫోరం ఫర్ నీట్ 10 గ్రాండ్ టెస్ట్స్,కీ

Satyam NEWS

టెట్ నోటిఫికేషన్ విడుదల

Bhavani

ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్

Murali Krishna

Leave a Comment