27.2 C
Hyderabad
May 18, 2024 22: 02 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాధ స్వామి రథోత్సవం..

#Chariotsavam

అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాద బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి రథోత్సవం అత్యంత కన్నుల పండువగా జరిగింది.వైఖానస ఆగమశాస్త పండితులు మంత్రోచ్ఛారణ నడుమ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ముందుకు సాగనంపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందుండి రథాన్ని ముందుకు నడిపించారు. రథోత్సవానికి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు గోవింద నామస్మరణలతో మాడవీధులు మారు మ్రోగాయి. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులతో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మేడా విజయ బాస్కర్ రెడ్డి,నటుడు,దర్శకుడు తోట వేణు గోపాల్,మాజీ ఆలయ చైర్మన్ అరిగెల సౌమిత్రి చంద్రనాధ్,పెనుబాల నాగ సుబ్బయ్య,కాకి చంద్ర, సోమిశెట్టి ప్రభాకర్,అరిగెల నాని,అమీర్,ఖలీమ్, టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్,ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్,ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ శర్మ,ఉప అర్చకులు సాయి కృష్ణ,యశ్వంత్,పవన్ శర్మ,మనోజ్ బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు, బోయలు తదితరులు పాల్గొన్నారు.

పాల్గొన్న టీడీపీ నేతలు….

ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, ఎద్దల సుబ్బరాయుడు, పల్లె సుబ్రహ్మణ్యం, జంగం శెట్టి సుబ్బయ్య, గంగాధర్, ప్రవీణ్,వేణుగోపాల్, తాటి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు

Related posts

కరోనా వ్యాక్సిన్ అందరికి అవసరం లేదు

Satyam NEWS

తప్పు చేయని ఆదివాసీ బిడ్డకు అన్యాయం చేసిన ఉన్నతాధికారులు

Satyam NEWS

Gross Negligence: రోడ్డెక్కిన వసతి గృహ విద్యార్థులు

Satyam NEWS

Leave a Comment