అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ భూదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా యాలివాహణం పై స్వామి వారి మాడ వీధుల్లో గ్రామోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు.
వివిధ రకాల పూలతో పట్టు వస్త్రాలతో స్వామి వారిని నేత్రపర్వంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు నడుమ ,భక్తుల గోవింద నామాల మధ్య ఈ గ్రామోత్సవ కార్యక్రమంలో స్వామి వారికి పెద్ద సంఖ్యలో భక్తులు నారికేళం,పండ్లు సమర్పించారు.
ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు మరియు మండలాధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి,ఆలయ చైర్మన్ అరిగెల సౌమిత్రి చంద్రనాథ్,ఈవో కొండారెడ్డి, శేషారెడ్డి,ఆలయ అర్చకులు సునీల్ శర్మ, బాల సుబ్రమణ్యం స్వామి తదితరులు పాల్గొన్నారు.