ప్లాస్టిక్ వస్తువుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ రఘు ప్రోలు విజయలక్ష్మి, కమిషనర్ సొంటే రాజయ్య పిలుపునిచ్చారు. గురువారం కొల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ నివారణపై వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు.ప్లాస్టిక్కు బదులుగా ప్రతి ఒక్కరూ పేపర్, గుడ్డ సంచులను వాడాలని సూచించారు. ప్లాస్టిక్ వస్తువులను,కవర్లను వినియోగించవద్దని వ్యాపారులకు,ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వివరణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సమావేశంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జమీర్ పాషా,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.