30.2 C
Hyderabad
May 17, 2024 21: 20 PM
Slider నిజామాబాద్

వైఎస్ఆర్ ను గౌరవించని రేవంత్ రెడ్డి పైనే నా పోటీ

#neelamsudhakar

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ను గౌరవించని రేవంత్ రెడ్డి పైనే తన పోటీ అని వైఎస్ఆర్టిపి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసారు. తాను ప్రస్తుతం వైఎస్ఆర్టిపిలో జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నానని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్టిపి అనివార్య కారణాల వల్ల పోటీ చేయడం లేదన్నారు. వైఎస్ఆర్ ఆశయాలతోనే వైఎస్ఆర్టిపి పుట్టుకొచ్చిందని తెలిపారు. వైఎస్ఆర్ పేదల పెన్నిది అని, పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, అలాంటి వైఎస్ఆర్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్నారు.

కామారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి పోటీలో ఉంటున్నారని, వైఎస్ఆర్ ను గౌరవించని రేవంత్ రెడ్డిపైనే తాను స్వతంత్ర అభ్యర్థిగా కామారెడ్డి బరిలో పోటీలో ఉంటున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ విలువలు తెలియవని, వైఎస్ఆర్ అసలైన వారసురాలు వైఎస్ షర్మిల రెడ్డి మాత్రమేనన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఎంతోమంది వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారని, ఆయన అభిమానులు ఆయన ఆశయాల నుంచి పుట్టుకొచ్చిన వైఎస్ఆర్టపి వెంట, తన వెంట ఉంటారని తెలిపారు. ఈసారి కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మద్దతు ఉంటుందని కోరుకుంటున్నానని ప్రకటనలో పేర్కొన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

పవిత్రమైన రంజాన్ సందర్భంగా పోలీసు ఉదారం..!

Satyam NEWS

అందాల రేఖ 68వ పుట్టిన రోజు నేడు

Satyam NEWS

కొల్లాపూర్ కోట పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

Satyam NEWS

Leave a Comment